హైదరాబాద్ : హైదరాబాద్ పోలీసులపై గోవా ఎమ్మెల్యేలు ప్రశంసల వర్షం కురిపించారు. శాంతి భద్రతలను కాపాడటంలో హైదరాబాద్ పోలీసులు బెస్ట్ అని గోవా ఎమ్మెల్యేలు కితాబిచ్చారు. బషీర్బాగ్లోని నగర పోలీసు కమిషనర్ ఆఫీస్ను గోవా అసెంబ్లీ స్పీకర్ రాజేశ్ పట్నేకర్ నేతృత్వంలోని ఎమ్మెల్యేల బృందం సందర్శించింది.
ఈ సందర్భంగా సీపీ అంజనీ కుమార్తో గోవా ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. హైదరాబాద్ నగరంలో వినాయక చవితి, శ్రీరామనవమి, ఈద్, మోహర్రం వేడుకలకు చేపట్టే పటిష్ట బందోబస్తు అద్భుతమని గోవా ఎమ్మెల్యేలు కొనియాడారు. నగర పోలీసులు తమ విధుల్లో నిమగ్నమై, శాంతిభద్రతలను కాపాడుతున్నారని సిటీ పోలీసులపై స్పీకర్ రాజేశ్ ప్రశంసలు కురిపించారు.
ఈ సందర్భంగా గోవా ఎమ్మెల్యేలను సీపీ అంజనీ కుమార్ శాలువాలతో సత్కరించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పోలీసు కమిషనర్ ఆఫీసు సందర్శనతో పాటు తెలంగాణ అసెంబ్లీని కూడా గోవా ఎమ్మెల్యేల బృందం సందర్శించింది. ఈ సందర్భంగా తెలంగాణ అసెంబ్లీ పనితీరు, ప్రత్యేకతలను గోవా స్పీకర్కు శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి వివరించారు.