ఖైరతాబాద్, అక్టోబర్ 12: గో హింస, హత్యలను నిర్మూలించాలని, కబేళాలను మూసివేయాలని, ఆవును జాతీయ ప్రాణిగా గుర్తించాలని ఈ నెల 31న తిరుపతిలోని తారక రామ స్టేడియంలో సాయంత్రం 4గంటలకు గో మహా సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న టీటీడీ బోర్డు మాజీ సభ్యులు, యుగ తులసి ఫౌండేషన్ వ్యవస్థాపకులు కొలిశెట్టి శివ కుమార్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గోవు పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ, గోవును జాతీయ ప్రాణిగా గుర్తించాలని టీటీడీ చేసిన చారిత్రక తీర్మాణాన్ని వెంటనే అమలు చేయాలని ఈ సమ్మేళనం ద్వారా కేంద్రాన్ని డిమాండ్ చేస్తామన్నారు. కార్యక్రమానికి స్వామిజీలు, మఠాధిపతులు, పీఠాధిపతులు, సాధువులు, సంత్లు, గో ఉద్యమ సంస్థలు, గోశాలల నిర్వాహకులు, గో బంధువు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.