ఆర్కేపురం : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా మూడు రోజుల సేవా కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆర్కేపురం డివిజన్ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వృద్దాశ్రమంలో దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆర్కేపురం డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పెండ్యాల నగేష్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని అన్నారు. సీఎం కేసీఆర్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, డివిజన్ అధ్యక్షుడు పెండ్యాల నగేష్, మాజీ అధ్యక్షుడు మురుకుంట్ల అరవింద్శర్మ, నాయకులు గొడుగు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్కేపురం డివిజన్ ఉద్యమకారుల వేదిక ఆధ్వర్యంలో
సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకోని మంగళవారం ఆర్కేపురం డివిజన్ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కంచర్ల శేఖర్ ఆధ్వర్యంలో అల్కాపురిలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజల దశాబ్దాల చిరకాల కోరిక అయిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని అన్నారు.
సరూర్నగర్ డివిజన్లో
సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల్లో భాగంగా మంగళవారం సరూర్నగర్ డివిజన్లోని వీఎం హోమ్ అనాధ ఆశ్రమంలో విద్యార్థులకు మాజీ కార్పొరేటర్ పారుపల్లి అనితాదయాకర్రెడ్డి ఆధ్వర్యంలో నోట్ బుక్స్, పెన్నులు, పండ్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా పారుపల్లి అనితాదయాకర్రెడ్డి మాట్లాడుతూ సీ ఎం కేసీఆర్ ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నారు.