GHMC Mayor | హైదరాబాద్లో నాలుగైదు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు మూడు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశాలున్నాయని వాతావరణశాఖ హెచ్చరించింది. వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అప్రత్తమైంది. లోతట్టు ప్రాంతాలతో పాటు రోడ్లపై నీరు నిలువకుండా చర్యలు చేపడుతున్నది. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి మాట్లాడారు. కంట్రోల్ రూమ్, జీహెచ్ఎంసీ 24 గంటల పాటు పని చేస్తోందన్నారు.
ఐదురోజలుగా సిబ్బంది అంతా క్షేత్రస్థాయిలోనే ఉన్నారని చెప్పారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరిస్తున్నామన్నారు. గత ఐదురోజుల్లో 900 ఫిర్యాదులు వచ్చాయని, నారాయణగూడలో కొంత నీటి సమస్య ఉందని చెప్పారు. నాలాల పనులు దాదాపు పూర్తయ్యాయనని, జీహెచ్ఎంసీలో చేపట్టిన 36 పనుల్లో 30 పూర్తయ్యాయన్నారు. కంట్రోల్ రూమ్, జీహెచ్ఎంసీ 24 గంటల పాటు పని చేస్తోందని, హైదరాబాద్లో 483 శిథిలావస్థ భవనాలు గుర్తించామన్నారు. శిథిలావస్థలో ఉన్న 19 భవనాలను సీజ్ చేశామని, 92 భవనాల మరమ్మతులకు అవకాశం ఇచ్చామని వివరించారు.