సిటీబ్యూరో, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ) : జంక్షన్లను అభివృద్ధి పరిచేందుకు జీహెచ్ఎంసీ వినూత్న విధానానికి శ్రీకారం చుట్టింది. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, పాదచారుల భద్రతతో పాటు సులభంగా వెళ్లడం, వాహనాల వేగం తగ్గడం తదితర వాటికి ప్రాధాన్యతనిస్తూ జంక్షన్లను అభివృద్ధి చేయాలని అధికారులు నిర్ణయించారు.
తొలివిడతలో ప్రయోగాత్మకంగా ఆరు జోన్లకుగాను జోన్కు రెండు చొప్పున 12ట్రాఫిక్ జంక్షన్లను ఎంపిక చేశారు. వివిధ మెట్రో పాలిటన్ నగరాల్లో చేపట్టిన ట్రాఫిక్ జంక్షన్ల మాదిరిగా కాకుండా ప్రమాదాలను అరికట్టడం, పాదచారులు సురక్షితంగా, సులభంగా వెళ్లేందుకు దోహద పడేవిధంగా జంక్షన్లను అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు.