సిటీబ్యూరో, మార్చి 23 (నమస్తే తెలంగాణ) : క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహద పడతాయని డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్ రెడ్డి పేర్కొన్నారు. కార్పొరేటర్లకు మూడు రోజుల పాటు నిర్వహించే క్రీడలను డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్ రెడ్డి గురువారం ఖైరతాబాద్లోని విక్టరీ ప్లే గ్రౌండ్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ కార్పొరేటర్లతో పాటు క్యారమ్స్, చెస్లో పాల్గొన్నారు.
కార్పొరేటర్లకు నాగోల్ ఫతుల్లాగూడలో క్రికెట్, ఖైరతాబాద్ జోన్లో చెస్, క్యారమ్స్, టెన్నికాయిట్, మ్యూజికల్ చైర్, ఎల్బీనగర్ ఉప్పల్ స్టేడియంలో కబడ్డీ, సౌత్జోన్ కులీకుతుబ్షా స్టేడియం, శేరిలింగంపల్లి జోన్ చందానగర్ స్టేడియంలో షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించారు.తొలిరోజు స్పోర్ట్స్ మీట్ సందడిగా సాగిం ది.నిత్యం ప్రజాసమస్యల పరిష్కారమే ధ్యేయ ంగా పనిచేస్తున్న కార్పొరేటర్లు క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.