సిటీబ్యూరో, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో అమలవుతున్న పథకాలు అద్భుతమని, ఇతర రాష్ట్రాలకు ఆదర్శనీయంగా ఉన్నాయని భారత దర్శన్ ఐటీపీ ట్రైనీ ఐఏఎస్ అధికారులు ప్రశంసించారు. ఆయా రాష్ట్రాల నుంచి ఇటీవల ఎంపికైన ఐఏఎస్ ఆఫీసర్లు ముస్సోరీ ఐఏఎస్ అకాడమిలో శిక్షణ పొందుతున్న అధికారుల బృందం జీహెచ్ఎంసీని మంగళవారం సందర్శించింది. రెండు రోజుల పర్యటనలో భాగంగా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో వివిధ పథకాలు శానిటేషన్, బడ్జెట్, ఈ-ఆఫీస్, యూసీడీ, అర్బన్ బయోవర్సిటీ, ఎలక్ట్రిసిటీ, అర్బన్ హౌసింగ్ ఇంజినీరింగ్ మెయింటెనెన్స్, ఎస్ఆర్డీపీ, ఎస్ఎన్డీపీ, సీఆర్ఎంపీ పథకాలను జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేశ్ కుమార్తో పాటు అన్ని విభాగాల హెచ్ఓడీలు ఐఏఎస్లకు వివరించారు. ఈ సందర్భంగా ఈ -ఆఫీస్, బడ్జెట్ నిర్వహణ, యూసీడీ కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల కోసం ఎస్ఆర్డీపీ, వైకుంఠధామాలు తదితర పథకాలు బాగున్నాయని ట్రైనీ ఐఏఎస్ అధికారులు కొనియాడారు. అనంతరం జీహెచ్ఎంసీ ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు చేపట్టిన వివిధ అంశాలను కమిషనర్ వివరించారు.
ఈ కార్యక్రమంలో ట్రైనీ ఐఏఎస్ అధికారులు (గ్రూప్-3) వినయ్సింగ్, ఉపర్ సింగ్, రాజేంద్రకుమార్, పరంజిత్ సింగ్, శుభ్కరణ్ సింగ్, డా.అనీల్ గణపత్రావు రామోద్, అరుణ్కుమార్ పురోహిత్, డి.డి.కపాడియా, హర్జీలాల్ అటల్, నీలేశ్ రమేశ్ గట్నే, పటేల్ అశోక్కుమార్ బాబల్ భాయ్, కల్పనాఅగర్వాల్, స్వామి దిలీప్ వీరపక్షప్ప, భానుదాస్ హరిభు పల్వే, పుష్ప సత్యని, అంతర్సింగ్ నెహ్రా (గ్రూప్ -7) అధికారులు పర్మిందర్ పాల్సింగ్ సందు, జయిందర్ సింగ్ చిల్లర్, వివేక్ భారతి, డా.బ్రహ్మజీత్ సింగ్ ఉలక్, కరణ్ సింగ్, అనీల్ అన్నా సాహెబ్ పాటిల్, డా.రశ్మీశర్మ, సుభకర్ బాపూరావు తెలంగ్, లీనా మోరేశ్వర్ బన్సద్, శైలేశ్కుమార్ కనుభాయ్ ప్రజాపతి,ధనాని సంజయ్ కుమార్ దేవర్జ్ భాయ్, ఖాజన్ సింగ్, డా.మనీషా అరోరా, ఇక్బాల్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.