హైదరాబాద్: మహాశివరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని సికింద్రాబాద్లోని శ్రీ గణపతి దేవాలయం సిద్ధమైంది. రేపు మహాశివరాత్రిని ఘనంగా నిర్వహించేందుకు ఆలయ పాలకమండలి అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం నుంచి తెల్లవారు వరకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరుపనున్నారు.
శ్రీ ఉమా మహేశ్వరీ సమేత ఉమా మహేశ్వర స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు పూజలో గ్రేటర్ హైదరాబాద్ మేయర్ శ్రీమతి గద్వాల విజయలక్ష్మి పాల్గొన్నారు. ఆలయ అర్చకులు విజయలక్ష్మికి స్వామి వారి తీర్థప్రసాదాలు అందించి ఉమా మహేశ్వరుడి శేషవస్త్రాలు బహూకరించినట్లు ఆయల ధర్మకర్తల మండలి చైర్మన్ ఎస్ఎస్ జయరాజు తెలిపారు.