GHMC | సిటీబ్యూరో, మార్చి 13 (నమస్తే తెలంగాణ) : మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన బుధవారం జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. 16 అంశాలను ఆమోదించిన కమిటీ సభ్యులు.. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
బేగంపేట ఆర్వోబీ మరమ్మతులు, పునరుద్ధరణ పనులకు రూ.20కోట్లతో పనులు, రామకృష్ణాపురం (సికింద్రాబాద్) రైల్వే స్టేషన్ వద్ద ఆర్కేపురం ఆర్వోబీ పునరుద్ధరణ చర్యలకు రూ. 6 కోట్ల పనులకు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. యూసుఫ్గూడ బస్తీ జంక్షన్ అభివృద్ధికి అంచనా రూ. 4.90 కోట్లకు, రహ్మత్నగర్ పీజీఆర్ విగ్రహం జంక్షన్ అభివృద్ధికి అంచనా వ్యయం రూ. 5.17 కోట్ల పనులకు కమిటీ ఆమోదం తెలిపింది.