సిటీబ్యూరో, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ ) : ఉత్కంఠకు తెరపడింది. జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశానికి ఎట్టకేలకు ముహూర్తం కుదిరింది. ఈ నెల 19న జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ మేరకు సమావేశంలో జీహెచ్ఎంసీ బడ్జెట్పై విస్తృత చర్చతో పాటు శానిటేషన్, వీధి లైట్ల నిర్వహణ, వీధి కుక్కల బెడద, నాలా సమస్యలు, డబుల్ బెడ్రూం ఇండ్ల సమస్యలపై కార్పొరేటర్లు గళం విప్పేందుకు సిద్ధమవుతున్నారు.