సిటీబ్యూరో: బదిలీ ఉత్తర్వులను ధిక్కరించి, విధుల్లో చేరడంలో నిర్లక్ష్యం వహించిన జీహెచ్ఎంసీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఈఈ)పై వేటు పడింది. పబ్లిక్ హెల్త్ విభాగంలో ఈఈ పనిచేస్తున్న శ్రీనివాస్ను సస్పెండ్ చేస్తూ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో జీహెచ్ఎంసీలోని ఎస్డబ్ల్యూఎం, ట్రాన్స్పోర్టు విభాగంలో ఈఈగా విధులు నిర్వహించిన శ్రీనివాస్ను చార్మినార్ జోన్లోని డివిజన్ నంబరు 27 (మలక్పేట) , డివిజన్ నంబరు 29 (మూసారాంబాగ్)లకు బదిలీ చేస్తూ అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు.
అయితే బదిలీ అయి పది రోజులు గడిచినా.. శ్రీనివాస్ సంబంధిత బాధ్యతలు స్వీకరించలేదు. ఉన్నతాధికారుల ఆదేశాలను పట్టించుకోకుండా విధులకు గైర్హాజరు కావడం, కమిషనర్ ఆదేశాలను బేఖాతరు చేయడంతో చర్యలు తీసుకున్నారు.