హైదరాబాద్ : నగరంలోని ఫిల్మ్నగర్లో అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు. దక్కన్ కిచెన్ సమీపంలో ఉన్న రెండు నిర్మాణాల కూల్చివేతను చేపట్టారు. ఈ నిర్మాణాలు ఎమ్మెల్యేకు ఎర కేసులో నిందితుడు నందకుమార్విగా గుర్తించారు. ‘దక్కన్ కిచెన్’ను ప్రమోద్ అనే భాగస్వామితో కలిసి నందకుమార్ నిర్వహిస్తున్నాడు. అక్రమ నిర్మాణాలు చేపట్టి వ్యాపారాలకు వాడుతున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు పేర్కొన్నారు. నోటీసులు ఇచ్చినా ఆపకుండా కొనసాగిస్తుండటంతో పోలీసు బందోబస్తు మధ్య జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేత చేపట్టారు. నందకుమార్ స్థలాన్ని లీజుకు తీసుకుని అక్రమ నిర్మాణాలు చేపట్టి.. వ్యాపారానికి వాడుతున్నాడని.. ఈ మేరకు కోర్టు ఆదేశాలతో కూల్చివేస్తున్నట్లు వివరించారు.