సిటీబ్యూరో, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ : గ్రేటర్ను అభివృద్ధి పథకంలో నడిపించాల్సిన జీహెచ్ఎంసీలో ఇప్పుడు యజమాని లేని ఇల్లు అన్న చందంగా తయారైంది. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వీ కర్ణన్ సెలవుపై వెళ్లడమే ఆలస్యం.. కింది స్థాయి అధికారుల నుంచి విభాగాధిపతుల వరకు అందరూ ఆయా రామ్.. గయా రామ్ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అడిగే నాథుడు లేక, చెప్పే వారు లేక విధి నిర్వహణ గాలికొదిలేశారు. కార్యాలయానికి ఎప్పుడు వస్తున్నారో.. ఎప్పుడు వెళ్తున్నారో ఎవరికీ అంతుచికడం లేదు. ఫలితంగా సమస్యల పరిషారం కోసం వందల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చే సామాన్య పౌరులకు చుకలు కనిపిస్తున్నాయి.
అక్రమ నిర్మాణాలు, ట్యాక్స్ సవరణలు, దోమలు, కుకల బెడద వంటి సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు నగరవాసులు ట్యాంక్ బండ్ కార్యాలయానికి క్యూ కడుతుంటే, వారికి కనీసం సమాధానం చెప్పే నాథుడు కరువయ్యాడు. ముఖ్యంగా సందర్శన వేళలు (మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు) కచ్చితంగా సీట్లలో ఉండాలన్న నిబంధనను అధికారులు తుంగలో తొకారు. జోనల్, సరిల్ కార్యాలయాల్లో పరిస్థితి మరీ అధ్వానం. జోనల్ కమిషనర్లు సైతం ప్రజలకు అందుబాటులో ఉండటం లేదు. ముఖ్యంగా డిప్యూటీ కమిషనర్లు, ఇంజినీర్లు, మెడికల్ ఆఫీసర్లు పట్టనట్లు వ్యవహరిస్తుండటంతో ఫిర్యాదుదారులు నిరాశతో వెనుదిరుగుతున్నారు.