జూబ్లీహిల్స్, ఫిబ్రవరి 8 : రానున్న లోక్సభ ఎన్నికల నిర్వహణకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం) లను సిద్ధం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ అధికారులను ఆదేశించారు. గురువారం చాదర్ఘాట్ విక్టరీ ప్లే గ్రౌండ్లో ఓటింగ్ యంత్రాల మొదటి దశ పని తీరును పరిశీలించారు.
ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా, పారదర్శకంగా నిర్వహించడంలో కీలక భూమిక పోషించే ఈవీఎంల సమర్థతను పూర్తి స్థాయిలో నిర్ధారించాలని అధికారులకు సూచించారు.