సిటీబ్యూరో, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ) : వీధి లైట్ల సేవలు మెరుగుపర్చాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ ఆదేశించారు. గురువారం సీడీఏంఏ కార్యాలయంలో ఈఈఎస్ఎల్ ఏజెన్సీ అధికారులతో కమిషనర్ వీధి దీపాల నిర్వహణపై సమీక్షించారు.
జీహెచ్ఎంసీ పరిధిలో వీధి దీపాల నిర్వహణలో కార్పొరేటర్లు, ప్రజల నుంచి ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని, వాటిని సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఏజెన్సీని కమిషనర్ ఆదేశించారు. ఈ సమావేశంలో ఈఈఎస్ఎల్ ప్రతినిధులు, ఇంజినీరింగ్ చీఫ్ జియావుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.