సిటీబ్యూరో, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే చర్యల్లో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 2022-23 వార్షిక బడ్జెట్ రూ.6150 కోట్లతో రూపొందించింది. ఇందులో నగరం అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేసింది.
రోజూవారిగా జరిగే నిర్వహన పనులను చేపడుతూనే నగరవాసులకు మరింత మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా జీహెచ్ఎంసీ పనిచేస్తున్నది. ఇందులో భాగంగానే రూ.6150కోట్ల బడ్జెట్ను ఇటీవల స్టాండింగ్ కమిటీ ఆమోదించగా, మంగళవారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో బడ్జెట్పై విస్తృత స్థాయి చర్చ జరిగింది. అనంతరం రూ. 6150కోట్ల బడ్జెట్ను సభ్యులు ఆమోదించారు. ఈ ప్రతిపాదనను జీహెచ్ఎంసీ ప్రభుత్వానికి సమర్పించనున్నది.
బడ్జెట్లో ముఖ్యాంశాలు