హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన జీహెచ్ఎంసీ
నిమజ్జనం ఆంక్షలపై తీర్పు రిజర్వు
హైదరాబాద్, నమస్తే తెలంగాణ : వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, కాలుష్య నియంత్రణ కోసం మట్టి విగ్రహాలను ప్రోత్సహిస్తున్నామని జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేశ్కుమార్ హైకోర్టుకు తెలియజేశారు. హుస్సేన్సాగర్లో వినాయక ప్రతిమలను నిమజ్జనం చేయడం వల్ల వెలువడే కాలుష్యాన్ని నియంత్రించే విధంగా గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయడం లేదంటూ న్యాయవాది మామిడి వేణుగోపాల్ కోర్టు ధికార పిటీషన్ దాఖలు చేశారు.
దీనిపై హైకోర్టు తన తీర్పును రిజర్వు చేసి ఉంచింది. నిజమ్జనం విషయంలో తీసుకోవాల్సిన చర్యలు, అమలు చేయాల్సిన మార్గదర్శకాలు, నిమజ్జనంపై ఆంక్షలు, నియంత్రణ తదితర అంశాలపై తగిన ఆదేశాలు జారీ చేస్తామని తాతాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎమ్మెస్ రామచంద్రరావు, జస్టిస్ టి.వినోద్కుమార్లతో కూడిన ధర్మాసనం మంగళవారం ప్రకటించింది.
జీహెచ్ఎంసీ పరిధిలో హుస్సేన్సాగర్ సహా మొత్తం 23 చెరువులతోపాటు కొత్తగా 25 చిన్న నీటి కుంటలను(బేబీ పాండ్స్) ఏర్పాటు చేశామని, నగరవాసులు వాటిలో నిమజ్జనం చేసేలా ప్రోత్సహిస్తున్నామని బల్దియా కమిషనర్ లోకేశ్కుమార్ హైకోర్టుకు తెలియజెప్పారు. కొవిడ్ జాగ్రత్తలు తీసుకుంటున్నామని, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ సంయుక్తంగా లక్షా 75వేల మట్టి విగ్రహాలు పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. గతంలో కోర్టు ఆదేశాల మేరకే ఈ చర్యలు తీసుకుంటున్నామని అఫిడవిట్లో ప్రస్తావించారు.