బంజారాహిల్స్,మే 6: జెండర్ ఈక్వాలిటీని పాటించడంతో దేశంలోని అన్ని రాష్ర్టాలకు తెలంగాణ మార్గదర్శిగా నిలుస్తుందని కళాశాల సాంకేతిక విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్ అన్నారు. జూబ్లీహిల్స్లోని డా.బీఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, న్యూడిల్లీకి చెందిన కామన్వెల్త్ ఎడ్యుకేషనల్ మీడియా సెంటర్ ఫర్ ఆసియా(సీఈఎంసీఏ) సంయుక్త ఆధ్వర్యంలో రూపొందించిన మాసివ్ ఆన్లైన్ కోర్సు (మూక్స్) ద్వారా జెండర్ సెన్సిటైజేషన్ కోర్సును శుక్రవారం నవీన్ మిట్టల్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచే జెండర్ ఈక్వాలిటీ అనే అంశపై అవగాహన పెంచడం ఎంతో అవసరమన్నారు. దీనికోసం తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ స్థాయిలోనే విద్యార్థులకు పాఠ్యాంశాలు రూపొందించి అందిస్తున్నామన్నారు.మూక్స్ విధానం ద్వారా నచ్చిన కోర్సు ను, ఇష్టమైన యూనివర్సిటీ ద్వారా చదువుకోవడానికి అవకాశం ఏర్పడిందన్నారు. ఈ కార్యక్రమంలో సీఈఎమ్సీఏ డైరెక్టర్ ప్రొ.మధు పరార్, ఉస్మానియా వైస్ చాన్స్లర్ ఆచా ర్య డి.రవీందర్, అంబేద్కర్ వర్సిటీ అకాడమిక్ డైరెక్టర్ ప్రొ.సుధారాణి, వైస్ చాన్స్లర్ ప్రొ.సీతారామారావు, ఇన్చార్జ్జి రిజిస్ట్రార్ డా.ఏవీఎన్.రెడ్డి పాల్గొన్నారు.