జీడిమెట్ల, మార్చి 21 : డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల నుంచి కమర్షియల్ గ్యాస్ సిలిండర్లలోకి రీఫిలింగ్ చేస్తున్న ఆరుగురు ముఠా సభ్యులను పోలీసులు అరెస్టుచేసి రిమాండ్కు తరలించారు. మంగళవారం షాపూర్నగర్లోని డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బాలానగర్ జోన్ డీసీపీ శ్రీనివాస్ రావు వివరాలు వెల్లడించారు. ఆల్విన్ కాలనీ చివరి బస్టాప్ ప్రాంతానికి చెందిన గున్నం శివ (34), నూకతోట్టు నరేశ్ (27), బోయని సురేశ్ (35), బాచుపల్లి క్రాంతినగర్కు చెందిన గారాల మహేశ్(28), బాచుపల్లి ప్రగతినగర్కు చెందిన సడ్లది నాగరాజు (39), బాచుపల్లి ఎక్స్ రోడ్డుకు చెందిన సురువుల కార్తిక్ (21) లతో పాటు అబ్దుల్ ఖాదర్, కల్వగడ్డ కృష్ణలు ఆల్విన్కాలనీ చివరి బస్టాప్, బాచుపల్లిలో స్థావరాలను ఏర్పాటు చేసుకొని డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల నుంచి కమర్షియల్ గ్యాస్ సిలిండర్లలోకి రీఫిలింగ్ చేసి విక్రయిస్తున్నారు.
సమాచారం అందుకున్న బాలానగర్ ఎస్ఓటీ, జగద్గిరిగుట్ట పోలీసులు సంయుక్తంగా సోమవారం రాత్రి వారి స్థావరాలపై దాడి జరిపి ఆరుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సుమారు రూ.30 లక్షల విలువచేసే 257 గ్యాస్ సిలిండర్లు, 5 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు అబ్దుల్ ఖాదర్, కల్వగడ్డ కృష్ణ పరారీలో ఉన్నారు. సమావేశంలో బాలానగర్ ఏసీపీ గంగారం, జగద్గిరిగుట్ట సీఐ సైదులు, బాలానగర్ ఎస్ఓటీ సీఐ రాహుల్ దేవ్, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.