హైదరాబాద్ : నగరంలోని నిజాంపేట్ ప్రధాన రహదారిలో గ్యాస్ లీకేజీ అయింది. గాయత్రీ నగర్ వద్ద శుక్రవారం ఉదయం జేసీబీతో తాగునీటి పైపులైన్ పనులు చేస్తుండగా గ్యాస్ పైపులైన్ పగిలిపోయింది. దీంతో గ్యాస్ లీకేజీ కావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గ్యాస్ లీక్ కాకుండా అధికారులు మరమ్మతులు చేపట్టారు.