సిటీబ్యూరో, అక్టోబరు 16 (నమస్తే తెలంగా ణ): రోజు వారి ధరల పెంపుతో సామాన్య ప్రజలకు షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతుం టే, తాజాగా ఎల్పీజీ గ్యాస్ ధరలను కేంద్రం పెంచుతూ వస్తోంది. దీంతో సామాన్యులపై గ్యాస్ బండ భారం మోయలేనంత మారింది. పేరుకే కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్పై సబ్సిడీ ఇస్తామని చెబుతున్నా, అది కేవలం ఒక్కో సిలిండర్పై రూ.40.72లు గానే ఉంది. దీంతో నగరంలో అక్టోబరు 5 వరకు రూ.937లు ఉన్న సిలిండర్ ప్రస్తుతం రూ. 952లకు చేరుకుంది.
గ్యాస్ వినియోగదారులు రూ.952లు చెల్లిస్తే అందులో సబ్సిడీ రూపంలో కేవలం రూ. 40.72 పైసలను మాత్రమే కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి ప్రారంభంలో 821.50లుగా ఉన్న సిలిండర్ ధర, ఆ నెలాఖరులో ఒక్కో గ్యాస్ సి లిండర్ ధర రూ.846. 50 పైసలకు పెరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అలా ఏడాదిలో 8 నెలల్లో ఒక్కో సిలిండరుపై రూ.131 పెరిగింది. సబ్సిడీ మాత్రం ఒక్క రూపా యి పెంచలేదు.
ఇప్పటికే లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు సెంచరీ దాటినట్లే, త్వరలోనే సిలిండర్ గ్యాస్ రూ.1000లు దాటే అవకాశం ఉందని అభిప్రాయాన్ని పలువురు వ్య క్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ తీరు చూస్తే మున్ముందు గ్యాస్ ధరలను మరింతగా పెంచే అవకాశం ఉందని నగరవాసులు ఆందోళనకు గురవుతున్నారు. ఒక వైపు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరుగుతున్నాయి.