ఉప్పల్, అక్టోబర్ 29 : గంజాయి ప్యాకెట్లు విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 410 గ్రాముల గంజాయి, సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. ఉప్పల్ ఎక్సైజ్ సీఐ చంద్రశేఖర్గౌడ్ కథనం ప్రకా రం..ఉప్పల్ అశోక్నగర్ శ్రీనివాస హోటల్ ప్రాంతంలో గురువారం రాత్రి తనిఖీలు చేపట్టగా, ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. తప్పించుకొని పారిపోయేందుకు ప్రయత్నిస్తుంటే పట్టుకున్నారు. వీరి వద్ద గంజాయి ప్యాకెట్లు లభ్యమయ్యాయి. నిందితులు చాణిక్యపురికాలనీకి చెందిన జయరాం సాహూ అలియాస్ రామ్ సాహు(25), మల్లాపూర్ ఎన్టీఆర్నగర్కు చెందిన పగిడిపల్లి రవీందర్బాబు(24)లుగా గుర్తించారు. దూల్పేట నుంచి గంజాయి కొనుగోలు చేసి.. కిలో రూ.1200 చొప్పున కళాశాల విద్యార్థులు, గంజాయి వినియోగదారులే లక్ష్యంగా అమ్మకాలు సాగిస్తున్నట్లు తెలిసింది. నిందితులను రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.