అంబర్పేట, సెప్టెంబర్ 12 : శ్రీగంగపుత్ర సంఘం తిలక్నగర్ కమిటీ ఆధ్వర్యంలో గండిపేట చెరువు వద్ద గంగపూజ, గంగ తెప్పోత్సవం నిర్వహించారు. కమిటీ చైర్మన్ పూస నర్సింహా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముడారి బెస్త పోచయ్య, సభ్యులు కాపరవేని రాజబోస్, కొమ్ము బాలరాజు, ముడారి పరశురామ్, పెంటం నర్సింగ్రావు, కొమ్ము యాదగిరి బెసరాజు, పెండం ధర్మేందర్, పంపరి భాస్కర్, పెంటం మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పూస నర్సింహా మాట్లాడుతూ.. గంగపుత్రుల సమస్యలు పరిష్కారం కావాలని, జీవో నెంబర్ 6ను రద్దు చేయాలని, గంగపుత్రుల కష్టాలు తీరాలని కోరుకున్నామని తెలిపారు.