సిటీబ్యూరో, సెప్టెంబరు 19(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహా నగరంలో గణేష్ మహారాజ్ నిమజ్జనోత్స వం భక్తల కోలాహలంతో సందడిగా సాగింది. అన్ని విభాగాల అధికారుల మధ్య సమన్వయంతో శోభాయాత్ర జనరంజకంగా కొనసాగింది. భక్తుల జయ జయ ధ్వానాల నడుమ నిమజ్జన శోభాయాత్రలు ఆద్యంతం శోభాయమానంగా జరిగాయి. జన గణ నాయకునికి నిమజ్జన వేళ భక్తుల సేవలు అజరామరంగా నిలిచాయి. గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేసే ప్రక్రియలో భాగంగా అన్ని విభాగాల అధికారుల సమన్వయంతో పాటు పకడ్బందీ చర్యలతో మహా పండుగ ప్రశాంతంగా ముగిసింది. ‘జై బోలో గణేష్ మహరాజ్ కీ జై’ నినాదాలతో ఆదివారం విఘ్ననాథుడి శోభాయాత్ర నేత్ర పర్వంగా సాగింది. తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న పార్వతి తనయుడు అశేష జనవాహిని నడుమ ‘ఇక వస్తానంటూ.. గంగమ్మ ఒడిలో ఒదిగిపోయాడు’.
ప్రశాంతంగా ముగిసిన నిమజ్జనోత్సవ ఘట్టంలో ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకున్నదని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అద్భుతమైన ఏర్పాట్లు చేసిందని భాగ్యనగర ఉత్సవ కమిటీ ప్రతినిధులు ప్రశంసించారు. ఒక పక్క బేబీ పాండ్ (కొలనులు) 25 ఏర్పాటు చేస్తూనే మరో పక్క హుస్సేన్సాగర్, పీవీ మార్గ్, సరూర్నగర్ చెరువుల వద్ద నిమజ్జన ఏర్పాట్లను చేపట్టింది. నిమజ్జనంతో పాటు సాగర తీరానికి తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం జీహెచ్ఎంసీ, ఎలక్ట్రిసి టీ, ఆర్అండ్బీ, పోలీస్, వాటర్వర్క్స్, సాంస్కృతికశాఖ ల ఆధ్వర్యంలో సౌకర్యాలు కల్పించి భేష్ అనిపించారు.
శోభాయాత్ర ప్రశాంతంగా, ఏ విధమైన ఆటంకాలు లేకుండా నిర్వహించడానికి నగర పాలక యంత్రాంగానికి సహకరించాలని భక్తులు, గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులకు మంత్రి తలసాని, మేయర్ విజయలక్ష్మీ ఎప్పటికప్పుడు విజ్ఞప్తులు చేశారు.
ప్రజలు అన్ని పండుగలను వైభవంగా జరుపుకోవాలి అనేది ప్రభుత్వ ఆలోచన అని, పశు సంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. లక్షలాది మంది పాల్గొనే గణేష్ శోభాయాత్రకు దేశంలోనే ఎంతో ప్రత్యేకత ఉందని మంత్రి శ్రీనివాస్ యా దవ్ తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో సుమారు 35 వేలకు పైగా విగ్రహాలను ప్రతిష్టించినట్లు తెలిపారు. వీటిలో కొన్ని మూడో రోజు, మరికొన్ని విగ్రహాలను ఐదో రోజున నిమజ్జనం చేసినట్లు పేరొన్నారు. మిగిలిన విగ్రహాలు అన్ని ఆదివారం నిమజ్జనం అయినట్లు వివరించారు. ప్రశాంతంగా శోభాయాత్ర, నిమజ్జనం ఘట్టం ముగిసిందని మంత్రి తలసాని పేర్కొన్నారు.
గ్రేటర్లో నిర్దేశించిన ప్రదేశాలలో గణేష్ నిమజ్జనం ఎలాంటి చిన్న అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా శాంతియుతంగా ప్రశాంతంగా జరిగిం ది. శోభాయాత్ర విజయవంతంలో భాగస్వాములైన ప్రతి ఒకరికీ ధన్యవాదాలని మేయర్ తెలిపారు. ప్ర త్యేకంగా నిమజ్జనంలో పోలీస్, జీహెచ్ఎంసీ శానిటేషన్ సిబ్బంది వరర్స్, రోడ్లు భవనాలు, ట్రాన్స్ కో, హెచ్ఎండీఏ, జలమండలి, ఎంటమాలజీ అధికారు లు సిబ్బంది, అధికారులు, సిబ్బంది 24 గంటల పా టు పని చేసి భక్తులకు ఇబ్బంది కలగకుం డా విశేష కృషి చేశారన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలు నిమజ్జన ప్రాముఖ్యతను ప్రపంచ వ్యాప్తంగా ప్రసా రం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.