తొమ్మిదిరోజుల పాటు పూజలు అందుకున్న గణేశుడి నవరాత్రి ఉత్సవాల్లో తుది ఘట్టమైన నిమజ్జనం ఏర్పాట్లు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పీఎస్ల పరిధిలో పూర్తయ్యాయి. ఆదివారం సామూహిక నిమజ్జనం కోసం భారీగా గణనాయకులు తరలివెళ్లనుండడంతో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిఘా పెట్టారు. నిమజ్జనం కోసం ఇప్పటికే రూట్మ్యాప్స్ను ఖరారు చేసిన పోలీసులు ప్రతి ఊరేగింపు వద్ద బందోబస్తు నిర్వహించనున్నారు.
బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో ఈ ఏడాది 303 గణపతి మండపాలు ఏర్పాటు చేయగా, వాటిలో ఇప్పటికే సుమారు 140 దాకా విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి. మిగిలిన 160 గణేష్ విగ్రహాలను ఆదివారం నిమజ్జనం కోసం తరలించనున్నారు. జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో ఈ ఏడాది మొత్తం 257 గణపతి మండపాలను ఏర్పాటు చేయగా వాటిలో సగం విగ్రహాలు ఇప్పటికే నిమజ్జనం కోసం తరలివెళ్లాయి.
హుస్సేన్సాగర్లో నిమజ్జనానికి వివిధ శాఖల అధికారులు అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు.ఆదివారం జరిగే గణనాథుల శోభాయాత్రను వీక్షించేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో నారాయణగూడ పోలీసులు వ్యూహాత్మకమైన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
ట్యాంక్బండ్కు సమీపంలోని లిబర్టీ,బషీర్బాగ్, హైదర్గూడ, హిమాయత్ నగర్, నారాయణగూడ తదితర ప్రాంతాల ప్రధాన రోడ్లపై భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ పోలీస్స్టేషన్ పరిధిలోని సిబ్బందితో పాటు వివిధ జిల్లాల నుంచి వచ్చి అదనపు సిబ్బం దితో కలిసి 210 మంది పోలీసులు నిఘా అడుగడుగున ఏర్పాటు చేసి, 9 పుషింగ్ పార్టీలు, సమస్యాత్మక ప్రాంతాలు, ప్రధాన రోడ్లు, కూడళ్ల వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సీ సీ కెమెరాలతో నిమజ్జనోత్సవ ఘట్టాలను పోలీసు అధికారులు పర్యవేక్షణ చేస్తారు.
సెక్టార్లుగా విభజించి అక్కడ పుషింగ్ పార్టీలు, ఒక ఇన్స్పెక్టర్,ఇద్దరు ఎస్సైలు ,పదిమంది పోలీస్ సిబ్బంది ఉంటూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసు కుంటు న్నారు. బషీర్బాగ్,నారాయణగూడ ఫ్లైఓవర్స్తోపాటు ప్రధాన రహదారులకు ఇరు వైపులా ఉన్న కాలనీలు,బస్తీల దారులను ముళ్ల కంచెలు,బారీకేడ్లతో మూసివేయనున్నట్లు ఇన్స్పెక్టర్ భూపతి గట్టుమల్లు ,అడ్మిన్ఎస్సై డి.కరుణాకర్రెడ్డి తెలిపారు.