సిటీబ్యూరో, జూలై 14 (నమస్తే తెలంగాణ) : నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ ప్రజలకు చక్కటి ఆరోగ్యాన్ని అందిస్తున్న పారిశుధ్య కార్మికుల భద్రతకు బల్దియా అధిక ప్రాధాన్యమిస్తున్నది. ఇప్పటికే వారి ఆరోగ్య రక్షణకు సుమారు రూ.కోటి విలువైన హెల్త్కిట్లను అందజేయగా, బుధవారం రూ.10.8 కోట్ల విలువజేసే పీపీఈ కిట్లను మరో 20,775 కార్మికులకు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అందజేశారు. పురుషులకిచ్చే కిట్ విలువ రూ.5016, మహిళలవి రూ.4807. ఖరీదైన ఈ కిట్లను తప్పనిసరిగా వాడాలని మేయర్ సూచించారు.