హైదరాబాద్ : పురాతన కాలం నాటి గచ్చిబౌలి మెట్ల బావిని పునరుద్ధరించారు. ఈ బావిని అర్బన్ డెవలప్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ బుధవారం ప్రారంభించారు. ఈ క్రమంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్కు, ది రెయిన్వాటర్ ప్రాజెక్ట్ వ్యవస్థాపకురాలు కల్పనా రమేశ్కు, చిరెక్ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యానికి అభినందనలు తెలుపుతూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
రెయిన్ వాటర్ ప్రాజెక్టు కింద ఈ బావి పునరుద్ధరణ చేపట్టారు. గచ్చిబౌలి మెట్ల బావిని పునరుద్ధరణ కంటే ముందు, దాంట్లోని సున్నం గాఢతను పరీక్షించారు. అనంతరం రెడీ మిక్స్లో సున్నాన్ని కలిపి పునరుద్ధరణ చేపట్టారు. ఈ బావి పునరుద్ధరణకు కృషి చేసిన చిరెక్ స్కూల్ యాజమాన్యంపై, ది రెయిన్వాటర్ ప్రాజెక్ట్ వ్యవస్థాపకురాలు కల్పనా రమేశ్పై ప్రశంసలు కురిపించారు. కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా మరిన్ని స్కూల్స్ ఇలాంటి కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలన్నారు.