వెంగళరావునగర్ : కాలనీల సుందరీకరణకు అవసరమైన నిధుల్ని మంజూరు చేస్తున్నామని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. మంగళవారం వెంగళరావునగర్ డివిజన్ జానకమ్మతోట ప్రాంతంలోని రూ.27 లక్షలతో ఫుట్పాత్ల సుందరీకరణ, రూ.9 లక్షలతో రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు .
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాగంటి మాట్లాడుతూ నియోవర్గంలోని కాలనీలను అందంగా తీర్చిదిద్దనున్నామని కాలనీ వాసులను అందులో భాగస్వాములుగా చేస్తున్నామని పేర్కొన్నారు. రహదారులు, మంచినీరు, డ్రైనేజీ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని అన్నారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా ఎల్లవేళలా అందుబాటులో ఉండి పరిష్కరిస్తున్నానని చెప్పారు.
నియోవర్గంలో అభివృద్ధి పనులను నిరంతరాయంగా కొనసాగిస్తానని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేసేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ దేదీప్య విజయ్, నాయకులు వేణు గోపాల్ యాదవ్, వేణు, చిన్న రమేష్, గజ్జల బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.