సిటీబ్యూరో, మార్చి 29 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును(Hyderabad Metro Rail Project) ఫ్రెంచ్ రాయబారి(French Ambassador) బృందం ప్రత్యేకంగా పరిశీలించింది. భారత్లో ఫ్రాన్స్ రాయబారి డాక్టర్ థియెరీ మాథ్యూ( Thierry Mathieu) ఆయన బృందానికి ఎల్ అండ్ టీ మెట్రో రైల్ లిమిటెడ్ అధికారులు శుక్రవారం స్వాగతం పలికారు.
ఉప్పల్లోని మెట్రో కమాండ్ కంట్రోల్ సెంటర్ను సందర్శించారు. మెట్రో రైల్ నెట్ వర్క్కి సంబంధించిన రైళ్ల రాకపోకలు, ప్రయాణికుల భద్రత, రియల్ టైమ్ సిస్టమ్ మేనేజ్మెంట్ తదితర అంశాలన్నీ నిర్వహణకు ఇది సెం ట్రల్ హబ్గా వ్యవహరిస్తుందని మెట్రో అధికారులకు ప్రతినిధులకు వివరించారు.
పట్టణ ప్రాంత రవాణా విభాగంలో వినూత్నత, సాంకేతిక పురోగతికి నిదర్శనమైన హైదరాబాద్ మెట్రో రైల్వే వ్యవస్థ ఎంతగానో ఆకట్టుకుందని ఫ్రెంచ్ రాయబారి థియెరీ మాథ్యూ తెలిపారు. భవిష్యత్తులోనూ కలిసి చేసేందుకు, సుస్థిరమైన అర్బన్ మొబిలిటీ సొల్యూషన్స్ను అభివృద్ధి చేసేందుకు పరిజ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకునేందుకు మాథ్యూ బృందం దోహదం చేస్తుందని మెట్రో ఎండి ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.