KTR Birthday | అబిడ్స్, జూలై 23: రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని సోమవారం తన ఆటోలో ప్రయాణికులకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడంతో పాటు 51 మందికి ఐదు రూపాయల భోజనాన్ని అందించనున్నట్లు ఆటో డ్రైవర్, మంత్రి కేటీఆర్ వీరాభిమాని గంధం ఆనంద్ తెలిపారు.
జియాగూడ నుంచి అఫ్జల్గంజ్ వరకు తన ఆటోలో సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రయాణికులకు ఉచితంగా ప్రయాణ వసతిని కల్పించనున్నట్లు వివరించారు. మధ్యాహ్నం ఫిలింనగర్లోని అపోలో ఆసుపత్రి వద్ద ఉన్న జీహెచ్ఎంసీ ఐదు రూపాయల భోజన కేంద్రం వద్ద తన డబ్బులతో 51 మందికి భోజనం చేయించనున్నట్లు పేర్కొన్నారు.