శంషాబాద్ రూరల్ : ప్రజల ఆర్యోగం కోసమే ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు శంషాబాద్ లిమ్స్ దవాఖాన చైర్మన్ డాక్టర్ రామ్రాజ్ తెలిపారు. ఆదివారం శంషాబాద్ మండలంలోని సుల్తాన్పల్లి గ్రామంలో ఉచిత మెగా వైద్య విబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని సుల్తాన్పల్లి గ్రామంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి మంచిస్పందన వచ్చి నట్లు ఆయన వివరించారు.
దీంతో పాటు గ్రామంలోని ప్రజలందరు వివిధ రకలైన వ్యాధులతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. వారికి ఉచితంగా గ్రామంలోని ప్రతి ఒక్కరికి బీపీ, షూగర్, ఈసీజీ, గుండె సబంధిత పరీక్షలు, లెన్స్ అన్ని రకాల వైద్య సేవలు ఉచితంగా అందజేశామని చెప్పారు. వేయి మందికి పరీక్షలు అందించడంతో పాటు అవసరమైన అన్ని పరీక్షలు ఉచితంగా చేశామని వివరించారు.
ప్రజలకు ప్రతి ఏడాది ఉచిత క్యాంపు ఏర్పాటు చేసి ఆరోగ్య గ్రామంగా తయారు చేస్తానని తెలిపారు. ఎంపీపీ జయమ్మశ్రీనివాస్ మాట్లాడుతూ మండలంలోని 27 గ్రామ పంచాయతీలలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి ప్రజలు ఆరోగ్యంగా ఉండే విధంగా చూడాలని సూచించారు.
కార్యక్రమంలో జడ్పీటీసీ నీరటి తన్విరాజు,వైస్ ఎంపీపీ నీలంమోహన్నాయక్,పార్టీ మండలాధ్యక్షుడు చంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి మోహన్రావు,నీరటి రాజు, డి శ్రీనివాస్,మార్కెట్ కమిటి చైర్మన్ వెంకటేశ్గౌడ్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు దండుఇస్తారి, ఎంపీటీసీ సంగీతసిద్ధేశ్వర్, ఉప సర్పంచ్ స్పందనగౌడ్, వార్డు సభ్యులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.