మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో మరో 22 బస్తీ దవాఖానలు..
బస్తీ దవాఖానల ఏర్పాటుకు ప్రభుత్వ భవనాల గుర్తింపు
మేడ్చల్, మార్చి29 : ప్రజలందరికీ ఉచిత వైద్య సేవలు అందించేలా ప్రభుత్వం బస్తీ దవాఖానలను ఏర్పాటు చేస్తున్నది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా నూతనంగా 22 బస్తీ దవాఖానల ఏర్పాటుకు సంబంధించి వైద్యశాఖ ప్రభుత్వ భవనాలను గుర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నది. జిల్లాలో ఇప్పటికే 64 బస్తీ దవాఖానలు ఉండగా మరో 22 బస్తీ దవాఖానలు నూతనంగా ప్రారంభం కానున్నాయి.మొత్తం 86 బస్తీ దవాఖానల ద్వారా ఉచితంగా నాణ్యమైన వైద్య సేవలు అందనున్నాయి.
రోజూ వంద మందికిపైగా వైద్య సేవలు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో బస్తీ దవాఖానల ఏర్పాటుకు ప్రభుత్వ భవనాలను గుర్తిస్తున్నాం. 22 బస్తీ దవాఖానల ఏర్పాటుకు ప్రభుత్వ భవనాలు గుర్తిస్తున్నాం. బస్తీ దవాఖానల్లో ప్రతి రోజూ వంద మందికి పైచిలుకు ప్రజలు వైద్య సేవలు పొందుతున్నారు. దవాఖానలలో బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులకు ఉచితంగా మందులను ప్రభుత్వం అందజేస్తున్నది.
– మల్లికార్జునరావు, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వైద్యాధికారి