రంగారెడ్డి జిల్లా కోర్టు, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ ప్రాంగణంలో అవేర్ గ్లోబల్ ఆసుపత్రి హెల్త్ క్యాంపు నిర్వహించింది. ఈ హెల్త్ క్యాంపును జిల్లా ప్రధాన న్యాయమూర్తి హరేకృష్ణ భూపతి గురువారం ప్రారంభించారు. అనంతరం న్యాయమూర్తికి వైద్య పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… న్యాయవాదులు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా నిత్యం పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. న్యాయవాదుల కోసం ఆసుపత్రి ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించడంపై సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మెట్రోపాలిటన్ సెషన్స్ న్యాయమూర్తి ఆర్.తిరుపతి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సుధాకర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి పొన్నం దేవరాజ్గౌడ్, వేణుగోపాల్రెడ్డి, న్యాయవాదుల సహకార సంఘం డైరెక్టర్ బాచిరెడ్డి శాయిరెడ్డి, బర్ల సునీతతో పాటు పలువురు న్యాయవాదులు పాల్గొని వైద్య పరీక్షలు చేసుకున్నారు.