100 పడకలతో సెంటర్ ఏర్పాటు
కరోనాకు హోమియో మందులు
రామంతాపూర్, ఏప్రిల్ 21: కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లో అవకాశం ఉన్న ప్రాంతాల్లో ఐసొలేషన్ సెంటర్లను ఏర్పాటుచేస్తున్నది. ఈ నేపథ్యం లో రామంతాపూర్ ప్రభుత్వ హోమియో దవాఖానలో 100 పడకల ఐసొలేషన్ సెంటర్ ఏర్పాటుకు సిద్ధమైంది. ఇప్పటికే మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ జాన్ శ్యాంసన్ దవాఖానకు రెండుసార్లు పరిశీలించారు. ఈ సెంటర్లో మరుగుదొడ్లు, మంచినీరు తదితర సౌకర్యాలు ఏర్పాటుచేస్తున్నా రు. ఇప్పటికే కరోనా నిర్ధారణ పరీక్షలు సైతం చేస్తున్నారు. వ్యాక్సిన్నేషన్ సెంటర్ ఏర్పాటుకు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు సర్వం సిద్ధంచేశారు. హోమియో దవాఖానలోని డాక్టర్లు, సిబ్బంది సహాయంతో ఈ ఐసొలేషన్ సెంటర్లో కరోనా బాధితులకు చికిత్స అందించనున్నారు. మెదడువాపు వ్యా ధి, చికున్గున్యా వ్యాధులకు గతంలో హోమియో మందులు పంపిణీచేశారు. అదే తరహాలో కరోనా లక్షణాలు ఉన్నవారికి ఈ మందులు అందిస్తున్నారు. దగ్గు, జలుబు, గొంతు నొప్పి, ఉబ్బసం, డయాబెటీస్, తుమ్ములు, జ్వరం, షుగర్ తదితర లక్షణాలు గలవారికి 8 డ్రగ్స్ ఉంటాయని డాక్టర్లు చెప్తున్నారు.