సిటీబ్యూరో, జూన్ 16 (నమస్తే తెలంగాణ): పాతబస్తీకి చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగికి సైబర్నేరగాళ్లు టోకరా వేశారు. వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసి.. మేం పంపించే లింక్ను ఓపెన్ చేసి యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. వారి మాటలు నమ్మిన బాధితుడు.. యాప్డౌన్లోడ్ చేసి ముందుగా తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టడంతో లాభాలు వచ్చాయి.
వారు చెప్పే మాటలు నిజమని నమ్మి మూడు దఫాలుగా రూ. 7 లక్షలు పెట్టుబడి పెట్టాడు. అవి తిరిగి రాకపోవడంతో ఇదంతా మోసమని గుర్తించి గురువారం సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు దర్యాప్తు చేపట్టారు.