సిటీబ్యూరో, జూన్ 14(నమస్తే తెలంగాణ): కలర్ ప్రిడిక్షన్ గేమ్ స్కామ్ మరిచిపోకముందే అలాంటిదే మరో రకం మోసం వెలుగులోకి వచ్చింది. రంగులను ఎంచుకొని టార్గెట్లు పూర్తి చేయాలంటూ.. సోషల్మీడియాను వేదికగా ఉపయోగించుకొని అమాయకులను ‘విష్మాల్’ యాప్లోకి ఎంట్రీ చేయిస్తున్నారు. నిట్టనిలువునా మోసం చేస్తున్నారు. ఓల్డ్సిటీకి చెందిన ఓ మహిళకు ఫేస్బుక్లో పరిచయమైన మరో మహిళ విష్మాల్ యాప్తో రోజు వేలు సంపాదించవచ్చంటూ నమ్మించింది. లింక్ పంపించి.. అప్లికేషన్ను డౌన్లోడ్ చేయించింది. నిమిషాల వ్యవధిలోనే వేల రూపాయల లాభం వస్తుందంటూ నమ్మించింది.
బాధితురాలికి ముందుగా రూ. 5 వేలు లాభం చూపించగా, ఆ తరువాత రూ. 50 వేలు పెట్టుబడి పెట్టాలంటూ..సూచించారు. తన వద్ద అంత డబ్బు లేదని చెప్పగానే రూ. 30 వేలు నీవు పెట్టు ..మిగతాది కంపెనీ పెడుతుందంటూ సదరు యాప్ ప్రతినిధులు నమ్మించారు. రూ. 30 వేలు పెట్టుబడి పెట్టగానే కంపెనీ రూల్స్ ఒప్పుకోవడం లేదు మరో రూ. 20 వేలు చెల్లించాలంటూ ఒత్తిడి చేశారు. ఆమె వాటిని కూడా యూపీఐ ద్వారా చెల్లించడంతో యాప్లోని స్క్రీన్పై భారీగా లాభాలు వచ్చినట్లు చూపించారు. అయితే వాటిని డ్రా చేసుకునే వీలు లేకుండా పోయింది. ‘మూడు టార్గెట్లు పూర్తి చేయాల్సి ఉంటుంది.. మీ డబ్బు ఎక్కడి పోదం’టూ రెండు మూడు దఫాలుగా ఆమెతో రూ. 50 వేల చొప్పున పెట్టుబడి పెట్టించారు. అప్పటికే ఆమె రూ. 1.8 లక్షలు పెట్టుబడి పెట్టింది. ఇంకా డబ్బులు పెట్టాలంటూ సూచిస్తుండడంతో సోమవారం సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులను బాధితురాలు ఆశ్రయించింది.
మూడు రంగుల డబ్బాలు స్క్రీన్పై ఉంటాయి. వీటిని మూడు టార్గెట్లుగా పెడుతారు. ఒక రంగు ఎంచుకొని కింద ఎంత డబ్బు పెట్టాం అన్ని క్లిక్ చేస్తే లాభంతో పాటు పెట్టిన పెట్టుబడి స్క్రీన్పై కన్పిపిస్తుంది. అప్పటికే డబ్బు పెట్టింది డ్రా చేయాలంటే కుదరదంటూ.. సమాధానం వస్తుంది. రెండో టార్గెట్ పూర్తి చేయాలంటే మరికొంత పెట్టుబడి పెట్టాలి.. ఆ తరువాత మూడో రంగు ఎంచుకొని టార్గెట్ పూర్తి చేసుకోవాలని సూచిస్తారు. ఈ మూడు దఫాలలోనే కస్టమర్ను బోల్తా కొట్టించి అందిన కాడికి దోచేస్తుంటారు. ఇలా ఒక్కో కస్టమర్ మూడు నాలుగు రోజుల వ్యవధిలోనే లక్షలు పెట్టుబడి పెడుతూ.. మోసానికి గురవుతున్నారు. దీనిపై సైబర్క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
రిటైర్డు అర్మీ ఉద్యోగికి గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి మీ సిమ్ వెరిఫికేషన్ చేయాలి.. లేదంటే బ్లాక్ అవుతుందంటూ…భయపెట్టి.. క్విక్సపోర్టు యాప్ డౌన్లోడ్ చేయించారు. ఖాతాలో ఉన్న రూ. 1.6 లక్షలు దోచేశారు. మరో ఘటనలో సంతోష్నగర్కు చెందిన ఓ మహిళ తన ఆన్లైన్ బ్యాంకింగ్ పాస్వర్డ్ మర్చిపోవడంతో గూగుల్లో కస్టమర్ కేర్ నంబర్ కోసం సర్చ్ చేసింది. అందులో లభించిన ఓ నంబర్కు ఫోన్ చేయగా, తాము కస్టమర్కేర్ ప్రతినిధులమని చెప్పి.. ఖాతా వివరాలు ఓటీపీతో సహా తెలుసుకొని రూ. 2.28 లక్షలు ఆమె ఖాతాలో నుంచి ఖాళీ చేశారు. సైబర్క్రైమ్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.