సిటీబ్యూరో, జూన్ 2(నమస్తే తెలంగాణ): మీ సిమ్ బ్లాక్ అవుతుంది.. వెంటనే కస్టమర్ కేర్కు ఫోన్ చేసి కేవైసీ వివరా లు పూర్తి చేయండంటూ ఓ విశ్రాంత ఉద్యోగి ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లు రూ. 3.95 లక్షలు కాజేశారు. మహేంద్రహిల్స్కు చెందిన అశోక్కుమార్ రిటైర్డు ఉద్యోగి. ఆయన సెల్ఫోన్కు సిమ్ బ్లాక్ అవుతుందని.. కేవైసీ అప్డేట్ చేసుకోండి మెసేజ్ రాగా.. అందులోని నంబర్ను సంప్రదించాడు. అవతలి నుంచి మీరు రిచార్జిక్యూబ్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకుని.. చెప్పి అన్ని వివరాలు తెలుసుకుని.. అతని ఖాతా నుంచి రూ. 3.95 లక్షలు కాజేశారు.
సైఫాబాద్కు చెందిన శ్రీనివాసులుకు.. ఎస్బీఐ నుంచి మాట్లాడుతున్నామంటూ సైబర్నేరగాళ్లు ఫోన్ చేశారు. మీ కార్డుకు వైఫై సౌకర్యం లేదు.. దానిని మార్చుకోవాలంటూ సూచించగా బాధితుడు నిరాకరించాడు. రెండు మూడు రోజుల వ్యవధిలోనే బాధితుడి కొత్త క్రెడిట్ కార్డు వచ్చింది. కార్డును బాధితుడు వాడలేదు. మొదటి నెల బిల్లు రాగా.. అందులో రూ. 2.8 లక్షలు వాడినట్లు ఉంది. దీంతో బాధితుడు సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.