అధిక వడ్డీలు ఇస్తామని ఆశ చూపి.. లక్షలాది రూపాయలు వసూలుచేసి బెదిరింపులకు పాల్పడుతున్న దంపతులపై బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో చీటింగ్ కేసు నమోదైం ది. పోలీసుల వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నం.12లోని శ్రీరాంనగర్లో నివాసం ఉంటున్న అశ్విని ముకుందం అలియాస్ విజయానందం(50), అతడి భార్య భాగ్యలక్ష్మి గత కొంతకాలంగా తెలిసినవారికి అధిక వడ్డీలు ఇస్తామంటూ నమ్మించి భారీగా డబ్బులు వసూ లు చేశారు. ఈ క్రమంలో ఈసీఐఎల్, లక్ష్మీనగర్ కాలనీకి చెందిన సదర్ల పావని నుంచి 2019 మేలో రూ.15 లక్షలు తీసుకున్నారు. ఆరు నెలల్లో డబ్బులు తిరిగి ఇస్తామని చెప్పి అందుబాటులో లేకుండా పోయారు. ఎన్నిసార్లు అడిగినా డబ్బులు ఇవ్వకపోగా దూషణలకు, బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇటీవల వారి గురించి వాకబు చేయ గా మరికొంతమంది వద్ద నుంచి కూడా ఇదే విధంగా రూ.35లక్షల దాకా వసూలు చేసినట్లు తేలింది. దీంతో బాధితురాలు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేయగా వారిపై చీటింగ్ కేసు నమోదు చేశారు.