సిటీబ్యూరో, జూలై 5(నమస్తే తెలంగాణ): నిలోఫర్ దవాఖానలో డైట్ సరఫరాలో అక్రమాలకు పాల్పడిన మాజీ కాంట్రాక్టర్ సురేశ్బాబును సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. జాయింట్ సీపీ అవినాశ్ మహంతి కథనం ప్రకారం.. నిలోఫర్ దవాఖానలో రోగులకు, దవాఖాన సిబ్బందికి కావాల్సిన డైట్ను సరఫరా చేసేందుకు కోడురి సురేశ్బాబు కాంట్రాక్టు తీసుకున్నాడు. అయితే నిబంధనల మేరకు డైట్ సరఫరా చేయకపోవడమే కాకుండా నకిలీ ఇండెంట్లతో ఎక్కువ మొత్తంలో డైట్ సరఫరా చేసినట్లు బిల్లులు పెట్టి.. ప్రభుత్వానికి రూ.1.2కోట్లు నష్టం చేశాడు. కాంట్రాక్టర్పై ఆరోపణలు రావడంతో అధికారులు విచారణ జరుపగా కాంట్రాక్టర్ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. దీంతో నిలోఫర్ సూపరింటెండెంట్ గత నెల 17న సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఏసీపీ కె.శ్రీనివాస్రెడ్డి నేతృత్వంలోని బృందం దర్యాప్తు జరిపి నిందితుడు తప్పుడు పత్రాలను సృష్టించాడని, నిబంధనలు ఉల్లంఘించాడని తేల్చారు. ఈ మేరకు సురేశ్ బాబును అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
సిటీబ్యూరో, జూలై 5(నమస్తే తెలంగాణ): సీతాఫల్మండికి చెందిన మల్లికార్జున బ్యాంకు ఖాతాలో నుంచి గుర్తుతెలియని వ్యక్తులు రూ.6.5 లక్షలు కాజేశారు. దీంతో బాధితుడు సోమవారం సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అలాగే బోయిన్పల్లికి చెందిన ప్రభాకర్రావుకు బ్యాంకు అధికారులమంటూ ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు ఓటీపీలు తెలుసుకొని అతడి ఖాతా నుంచి రూ.1.2 లక్షలు స్వాహా చేశారు.