హైదరాబాద్: నగరంలోని చందానగర్లో విషాదం చోటుచేసుకున్నది. చందానగర్లోని పాపిరెడ్డి నగర్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. సుజాత, నాగరాజు దంపతులు తమ పిల్లలు రమ్యశ్రీ, టిల్లుతో కలిసి పాపిరెడ్డి నగర్లో నివాసం ఉంటున్నారు. అయితే గత మూడురోజులుగా వారి ఇంట్లో నుంచి ఎవ్వరూ బయటకు రాకపోవడం, పైగా అందులో నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు ఇంటి తలుపులు తెరచి చూశారు. దీంతో నలుగురు అప్పటికే మరణించినట్లు గుర్తించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత బలవన్మరణానికి పాల్పడ్డారని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమని భావిస్తున్నారు.