హైదరాబాద్: హైదరాబాద్లోని (Hyderabad) ఎర్రగడ్డలో (Erragadda) ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బీభత్సం సృష్టించింది. బుధవారం ఉదయం ఎర్రగడ్డలో సిగ్నల్ వద్ద ఆగి ఉన్న కార్లను ధనుంజయ ట్రావెల్స్ (Dhanunjaya travels) బస్సు ఢీకొట్టింది. దీంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు.
ఎర్రగడ్డలో రెడ్ సిగ్నల్ ఉన్నప్పటికీ బస్సు డ్రైవర్ ఆగకుండా దూసుకొచ్చాడని, దీంతో రెండు కార్లు ధ్వంసమయ్యాయని పోలీసులు తెలిపారు. డ్రైవర్ ర్యాష్ డ్రైవింగే ప్రమాదానికి కారణమని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ప్రమాదానికి కారణమైన బస్సు సీజ్ చేశామని చెప్పారు.