సిటీబ్యూరో, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న నలుగురిపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తూ రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ఏజెన్సీ ప్రాంతాల్లో తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి, తెలంగాణ, కర్ణాటక రాష్ర్టాలకు సరఫరా చేస్తున్న షేక్ ఫరీద్ ఇక్బాల్, అతడి గ్యాంగ్ సభ్యులు షేక్ మహ్మద్, షేక్ మునీర్, గట్టు సమ్మయ్యపై పీడీ యాక్ట్ నమోదు చేశారు.