సిటీబ్యూరో, ఫిబ్రవరి 23(నమస్తే తెలంగాణ) : సీసీఎంబీ పూర్వ విద్యార్థుల సమ్మేళనంతో భావితరాలకు విద్యా, ఉద్యోగ, రీసెర్చ్ అవకాశాలను కల్పిస్తున్నామని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ వినయ్ నందికూరి అన్నారు. సీసీఎంబీ ఫౌండర్ డా.పుష్పమిత్ర భార్గవ జయంతి సందర్భంగా ఏటా ఫిబ్రవరి 22న ఫౌండర్స్ డే పేరిట రెండురోజుల కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సీసీఎంబీ క్యాంపస్లో జరిగిన వేడుకలకు పూర్వ పీహెచ్డీ పట్టభద్రులు హాజరయ్యారు.
అనంతరం వారు మాట్లాడుతూ.. సీసీఎంబీ వ్యవస్థాపకుడిగా ఉన్న భార్గవ లైఫ్ సైన్సెస్ రంగానికి ఎనలేని సేవలు అందించారని, అంతర్జాతీయ స్థాయిలో గుర్తించే స్థాయికి ఎదిగిందని పలువురు పేర్కొన్నారు.46 ఏండ్లలో 500 మంది పీహెచ్డీ పొంది జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విధులు నిర్వర్తిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో అశోకా యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ డా. కస్తూరి మిత్ర, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇమ్యూనోలజీ ఫ్యాకల్టీ డా. అనీశ్కుమార్, నేషనల్ సెంటర్ బయోలాజికల్ సైన్సెస్ సభ్యులు ప్రొఫెసర్ సత్యజిత్ మేయర్తోపాటు సీసీఎంబీ పట్టభద్రులు పాల్గొన్నారు.