మహేశ్వరం, జూలై 6: గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం మహేశ్వరం మండల పరిధిలోని అమీర్పేట్, గట్టుపల్లి గ్రామాల్లో రూ. 18 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు జడ్పీ చైర్పర్సన్ తీగల అనితా హరినాథ్రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఒక విజన్తో గ్రామాల రూపు రేఖలు మారుస్తున్నదని, నేడు ప్రగతి పథంలో గ్రామాలు పయనిస్తున్నాయని చెప్పారు.
పల్లె ప్రగతితో సీఎం కేసీఆర్ గ్రామాల రూపు రేఖలు మార్చారన్నారు. ఇటీవల మహేశ్వరం పర్యటన సందర్భంగా సీఎం కేసీఆర్ మహేశ్వరం, కందుకూరు మండలాల్లోని గ్రామాలకు రూ.15 లక్షల చొప్పున నిధులు, మెడికల్ కళాశాల, సబ్స్టేషన్లను మంజూరు చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ తీగల అనితాహరినాథ్ రెడ్డి, ఎంపీపీ రఘుమారెడ్డి, వైస్ ఎంపీపీ సునితా ఆంద్యానాయక్, సహకార బ్యాంక్ చైర్మన్ పాండు యాదవ్, వైస్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, తాసీల్దార్ మహమూద్ అలీ, నియోజకవర్గ ఉపాధ్యక్షుడు చంద్రయ్య, కార్యదర్శి అంజయ్య ముదిరాజ్, ఎస్టీ సెల్ అధ్యక్షుడు లచ్యానాయక్, బీసీ సెల్ అధ్యక్షుడు మల్లేశ్యాదవ్, మండల పార్టీ అధ్యక్షుడు రాజునాయక్, ప్రధాన కార్యదర్శి రాఘవేందర్రెడ్డి, జిల్లా రైతుబంధు సమితి ప్రతినిధి యాదయ్య, మండల రైతుబంధు చైర్మన్ రాఘవేందర్రెడ్డి, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు థామస్రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు , పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
మంత్రి శంకుస్థాపన చేసిన అభివృద్ధి పనులివే..
మన్సాన్పల్లి నుంచి గట్టుపల్లి మీదుగా కోళ్లపడకల్ వరకు వరకు రూ. 15 కోట్ల 20 లక్షలు, బీటీ డబుల్ రోడ్డు నిర్మాణ పనులకు గట్టుపల్లి తండా నుంచి దావూద్గూడ తండా వరకు రూ. కోటి 80 లక్షల పనులు, అలాగే గట్టుపల్లి గ్రామంలో రూ. 10 లక్షలతో చేపట్టిన యూజీడీ పనులు, రూ. 8 లక్షలతో సీసీ రోడ్డు పనులు , రూ. కోటి 9 లక్షలతో అమీర్పేట్ గ్రామంలో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.