బండ్లగూడ, ఏప్రిల్ 29: బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపునకు అందరూ కలిసి కట్టుగా పని చేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ మహేందర్ గౌడ్, కార్పొరేటర్లు పద్మావతి పాపయ్య యాదవ్, సాగర్ గౌడ్, శ్రీలతా సురేశ్ గౌడ్ తదితరులు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ఆధ్యర్యంలో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో నరేశ్, స్థానిక నేతలు పాల్గొన్నారు.