కొండాపూర్, అక్టోబర్ 28 : చందా నగర్ మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతా రెడ్డి బీజేపీనీ వీడి బీఆర్ఎస్ లో చేరనుంది. నవంబర్ 2న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో గులాబీ గూటికి (సొంత పార్టీ) చేరనున్నట్లు ఆమె మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది.
ఇది వరకే మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలిపారు. ఇతర పార్టీలలో ఉన్న ఉద్యమకారులు సొంత పార్టీలోకి రావాలని, శేరిలింగంపల్లిలో పార్టీ బలోపేతానికి కృషి చేద్దామని పిలుపునిచ్చారు. నవంబర్ 2న పెద్ద సంఖ్యలో పార్టీలోకి చేరేందుకు తరలి రావాలన్నారు.