కుత్బుల్లాపూర్, ఫిబ్రవరి15: దూలపల్లిలోని తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ అకాడమీలో రెండురోజుల పాటు నిర్వహించిన ఆరవ అటవీ అధికారుల రాష్ట్రస్థాయి క్రీడోత్సవాలు బుధవారంతో ముగిశాయి. ఈ క్రీడల్లో చార్మినార్, భద్రాద్రి, రాజన్న, యాదాద్రి, జోగులాంబ, బాసర, కాళేశ్వరం అటవీ సర్కిళ్ల నుంచి వచ్చిన అధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఉత్సవాల ముగింపు వేడుకల్లో అటవీ శాఖ ప్రధాన ముఖ్య సంరక్షణాధికారి మోహన్ చంద్ర వర్గేయిన్ ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు బహుమతులు, పతకాలు, ప్రతిభా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అటవీ శాఖ అకాడమీ సంచాలకులు ఎల్యుసింగ్ మేరు, అటవీ శాఖ ఉన్నతాధికారులు, వినయ్కుమార్, జి. చంద్రశేఖర్రెడ్డి, సోనీ బాలాదేవి, వినోద్కుమార్, రమేశ్, సైదులు, భీమా నాయక్, శివాని డోగ్రా, వివిధ జిల్లాల అటవీ అధికారులు, డివిజనల్ అధికారులు, అకాడమీ అధికారులు, క్రీడాకారులు పాల్గొన్నారు.