మేడ్చల్ కలెక్టరేట్, ఫిబ్రవరి 19 : విదేశీ విశ్వవిద్యాలయాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్, డాక్టోరల్ కోర్సులను అభ్యసించడానికి స్కాలర్షిప్ (ఆర్థిక సహాయం) మంజూరు కోసం అర్హత కలిగిన మైనార్టీ విద్యార్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి మహమ్మద్ ఖాసీం ఒక ప్రకటనలో తెలిపారు.
1తేదీ ఆగస్టు 2023 నుంచి 31 డిసెంబర్ 2023 వరకు ప్రవేశం పొందిన, అన్ని అర్హత ప్రమాణాలు పూర్తి చేసిన విద్యార్థులు WWW.TELANGANA EPASS.CGG.GOV.IN వెబ్సైట్ ద్వారా ఈ నెల 20 నుంచి మార్చి 20 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. హార్డ్ కాపీలు, అవసరమైన పత్రాలు ఏప్రిల్ 15 లోపు అందజేయాలని, అన్ని స్కీమ్స్ తదితర వివరాలు వెబ్సైట్లో చూపబడ్డాయని తెలిపారు. వివరాలకు DMWO మేడ్చల్ జిల్లా కార్యాలయంలో కాని 9985145442, 9492 037940 నంబర్లల్లో సంప్రదించాలని సూచించారు.