సుల్తాన్బజార్,ఫిబ్రవరి 6 : పాదచారులు నడిచేందుకు ఏర్పాటు చేసిన ఫుట్పాత్లను ఆక్రమించిన వారిపై ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు. ఫుట్పాత్లను అక్రమించి వ్యాపారాలు నిర్వహించే వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని సుల్తాన్బజార్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కె శ్రీనివాస్ అన్నారు. సోమవారం సుల్తాన్ బజార్ ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ స్కాడ్ ఆధ్వర్యంలో కోఠి బ్యాంక్ స్ట్రీట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఆంధ్రా బ్యాంకు వరకు అక్కడి నుంచి డీఎంహెచ్ఎస్ చౌరస్తా వరకు కాలినడక దారి(ఫుట్పాత్)లను ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తున్న ఆక్రమణ దారుల నుంచి వస్తువులను స్వాధీనం చేసుకొని చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని సుల్తాన్బజార్ లా అండ్ ఆర్డర్ పోలీసులకు స్వాధీనం చేయడం జరిగిందని, ఆక్రమణ దారులపై అండర్ సెక్షన్ 341, 290, 283 కింద క్రిమినల్ కేసులు నమోదు చేశామన్నారు.
ఫుట్పాత్లను ఆక్రమించి వ్యాపారాలను నిర్వహిస్తే.. వాహనాలను నిలిపినైట్లెతే ఎఫ్ఐఆర్ నమోదు చేసి కోర్టులో వ్యాపారుల వస్తువులు, అక్రమంగా నిలిపిన వాహనాలను జతపరుస్తామని అన్నారు. రెండోసారి నేరానికి పాల్పడితే అటువంటి వారిని జైలుకు పంపుతామని అన్నారు. ఇకమీదట ఫుట్పాత్లను ఆక్రమించి పాదచారులకు ఇబ్బంది కలిగించే విధంగా వ్యాపారాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.