సిటీబ్యూరో, జూన్ 14 (నమస్తే తెలంగాణ): జలమండలి పరిధిలోని జంట జలాశయాలైన ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్కు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల వరద ప్రవాహం మొదలైంది. ఈనేపథ్యంలో సంబంధిత అన్ని ప్రభుత్వ విభాగాలు, జలాశయాల దిగువన నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జలమండలి ఎండీ అశోక్రెడ్డి విజ్ఞప్తి చేశారు.
ఈసందర్భంగా ఆయన ఆదివారం హిమాయత్ సాగర్ను సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. ఆదివారం ఉదయం సమయానికి ఉస్మాన్సాగర్లో 1784 అడుగులు, హిమాయత్ సాగర్లో 1760 అడుగుల వరకు నీటి నిల్వ ఉన్నట్లు తెలిపారు. హిమాయత్సాగర్కు ఎగువ నుంచి 800 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నదని వెల్లడించారు.